ముస్లింల అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది..

ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు..

తిరుపతి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 10:

ఆర్సీ రోడ్డు లోని షాది మహల్ లో అభివృద్ధి పనులకు సోమవారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శంకుస్థాపన చేశారు. షాది మహాల్ లో అసంపూర్తిగా ఉన్న ప్రహరీ గోడ, డ్రైనేజీ కాలువ పనులను మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో పూర్తి చేయనున్నారు.
ఈ రెండు పనులను ఎనిమిది లక్షలా ముప్పయ్ వేల రూపాయలతో పూర్తి చేయనున్నారు.షాది మహల్ ఆవరణను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పరిశీలించారు.షాది మహల్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు.ముస్లింల ను అన్ని విధాల అభివృద్ధి చేసుందుకు సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు కట్టుబడి ఉన్నట్లు ఆయన చెప్పారు. తిరుపతిలో ముస్లింలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తాను ముందుండి పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ముస్లింల సంక్షేమానికి ఎన్డీఎ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తిరుపతి పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు నరసింహ యాదవ్ చెప్పారు.
షాది మహాల్ ను అభివృద్ధి చేసి చూపుతామని ఆయన చెప్పారు.గత ఐదేళ్లలో షాదిఖాన అభివృద్ధిని వైసిపి ప్రభుత్వం పట్టించుకోలేదని టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యనిర్వహక కార్యదర్శి మహబూబ్ బాషా ఆరోపించారు.ఎన్డీఎ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో 8 లక్షల నిధులతో అభివృద్ధి పనులను చెప్పట్టిందని ఆయన తెలిపారు.ముస్లింల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, సూరా సుధాకర్ రెడ్డి, పులిగోరు మురళీ, దంపూరి భాస్కర్ యాదవ్, బిజి కృష్ణ యాదవ్, చినబాబు, పాఠకం వెంకటేష్,రఫీ,జనసేన నగర అధ్యక్షులు రాజా రెడ్డి, వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ బాల అయ్యంగార్,జానకిరామ్ రెడ్డి, ఉదయ్,కే ఏంకే లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version