బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు.డీఎస్పీ ప్రసాద్

DSP Prasad

పాకాల(నేటిధాత్రి) ఫిబ్రవరి 10:

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామలచెరువు పంచాయతీలో చంద్రగిరి డి.ఎస్.పి బి.ప్రసాద్ ఆధ్వర్యంలో కార్మికులతో పరిసరాలను పరిశుభ్రం పాకాల సి.ఐ సుదర్శన్ ప్రసాద్ సోమవారం చేపించారు.కార్యక్రమం దామలచెరువు పంచాయతీ కార్యదర్శి వి.మహేశ్వరి పాల్గొన్నారు.ఈ సందర్భంగా చంద్రగిరి డిఎస్పి బి.ప్రసాద్ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.కొంతమంది ఆకతాయిలు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఆకతాయిలు బహిరంగంగా మద్యం సేవిస్తున్న ప్రదేశాలను పరిశీలించి శుభ్రం చేపించామని పేర్కొన్నారు.సమీప ప్రదేశంలో పంచాయతీ సిబ్బందితో కలిసి కంప చెట్లను,ముండ్ల పొదలను శుభ్రం చేసి అక్కడ పెక్సీలను ఏర్పాటు చేసి హెచ్చరికలను జారీ చేశామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ వెంకటరమణ నాయుడు,అర్జున్,మహర్షి,శీను,పోలీస్ సిబ్బంది,పంచాయతీ సిబ్బంది,స్థానిక నేతలు లతీఫ్,భాష,పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!