ఎస్టిపిపి లో వైభవంగా శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ నందు నిర్మించిన నూతన రామాలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ప్రాతః కాలంలో జరిగింది.శ్రీ సీతారామచంద్ర స్వామి నూతన ఆలయ,స్థిర విగ్రహ సుదర్శన,గోదాదేవి,రామానుజ నమ్మల్వార్ చలవిగ్రహ,ధ్వజస్తంభ,ప్రతిష్ట మహోత్సవములు గత నాలుగు రోజులుగా జరుగుతున్నాయి.ఈ కార్యక్రమాలను ప్రధాన అర్చకులు శ్రీమాన్ గోవర్ధనగిరి జగన్నాథచార్యులు,గోదావరిఖని వాస్తవ్యులు,వారి శిష్య బృందం వేద పండితులైన వెంకట రమణాచార్యులు,సముద్రాల భాను కుమార్,సేనాపతి శేషాచార్యులు,కాండూరి వెంకటాచార్యులు,సముద్రాల అనంత ఆచార్యులు మరియు భరతాచార్యులు,అచలాపూర్ వేద పాఠశాల నుంచి విచ్చేసి ఈ దైవ కార్యక్రమాలని నిర్విఘ్నంగా సోమవారం పూర్తి చేయడం జరిగింది. శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ముఖ్య అతిథిగా సింగరేణి డైరెక్టర్(ఈ అండ్ ఏం ఆపరేషన్స్) మరియు(ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్)డి.సత్యనారాయణ రావు దంపతులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.ఈనెల 7వ తేదిన సాయంత్రం అంకురార్పణ పూజలతో ప్రారంభమై,8 వ తేది వాస్తు పురుష పూజ,మూలవిరాట్టుల,ఉత్సవ విగ్రహాల పుణ్యాహవచనం మరియు క్షీరాధివాసం అలాగే హోమాలు నిర్వహించారు.9వ తేది మూలవిరాట్టుల మరియు ఉత్సవ విగ్రహాల జలాధివాసం,ధాన్య ఫల పుష్ప శయ్యాధివాసం అలాగే హోమాలు,యజ్ఞాలు జరిపించారు.10 వ తేదీ తెల్లవారుజామున ఉదయం 4:25 నిమిషాలకి మూలవిరాట్టుల ప్రతిష్టాపన,గోపురాన సుదర్శన చక్రస్థాపన,ధ్వజస్తంభ స్థాపన మరియు ప్రాణ ప్రతిష్ట,బలి నివేదన మొదలైన కార్యక్రమాలు జరుపబడ్డాయి.అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటలకు అభిషేకం,అలంకరణ అనంతరం మహా అన్నప్రసాదం వితరణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా డైరెక్టర్ మాట్లాడుతూ ఈ ఆలయ శంకు స్థాపన కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని,ఆలయ కమిటి సభ్యులు ఒక సంవత్సర కాలంలో ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పి అనుకున్న విధంగా సంవత్సరంలోపే నిర్మిచడం అనేది చాలా గొప్ప విశేషం అన్నారు.ప్లాంటు రక్షణార్ధం,అందరు ఉద్యోగుల సంరక్షనార్ధం నూతన సీతారామ చంద్రస్వామి ఆలయం ఇక్కడ నిర్మిచుకోవడం మన పూర్వ జన్మ సుకృతంమని,ఈ సందర్బంగా ఉద్యోగులందరికి శుభాకాంక్షలు తెలియజేసారు.అలాగే ఈ కార్యక్రమానికి సింగరేణి సంస్థ సి & ఎండి శ్రీ ఎన్. బలరాం,ఐఆర్ఎస్ రావాలని ఉన్నా అనివార్య కారణాల రిత్యా రాలేకపోయారని,వారి తరుపున ఉద్యోగులందరికి, భక్తులు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ దంపతులు డి.సత్యనారాయణ రావు-శ్రీమతి హరిణి,జిఎం (ఓసిపి) డి.వి.ఎస్.ఎన్.రాజు దంపతులు,రిటైర్డ్ జిఎం(ఎస్టిపిపి)సుధాకర్ రెడ్డి దంపతులు,రిటైర్డ్ జిఎం (ఫైనాన్సు)నరసింహ రెడ్డి దంపతులు,ఎస్టిపిపి ఇంచార్జి ఈడి( హెడ్ అఫ్ ది ప్లాంట్) కే.శ్రీనివాసులు- సుమిధ,చీఫ్ అఫ్ (ఓ&ఎం)జే ఎన్ సింగ్ – సంగీత,ఆలయ కమిటి అధ్యక్షుడు ఏజిఎం (ఫైనాన్స్) టి.సుధాకర్ దంపతులు,ఆలయ కమిటి సెక్రటరీ సముద్రాల శ్రీనివాస్ దంపతులు,ఏజిఎం(సివిల్) కెఎస్ఎన్ ప్రసాద్ దంపతులు, ఏఐటియుసి పిట్ సెక్రటరీ సత్యనారాయణ దంపతులు, డిజిఎం (పర్సనల్)అజ్మీరా తుకారాం దంపతులు,ఇతర అధికారులు,ఉద్యోగులు మరియు భక్తులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version