ఓపి అనస్థీషియా ఫీజు పెంపు ఆలోచన వెనకకు తీసుకోవాలి

ఆసుపత్రుల ముందు ఆందోళనలు చేపడతాం..

సిపిఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్.

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలో వైద్యం పేరుతో ప్రయివేట్ హాస్పటల్స్ చేస్తున్న దోపిడీలో భాగంగా ఓపి,అనస్థిషియా ఫీజులు పెంచడం జరిగిందని ఈ ఆలోచనను వెనుకకు తీసుకోవాలని లేకపోతే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై ఆందోళనలు చేపడతామని సిపిఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ హెచ్చరించారు.సిపిఎం నర్సంపేట పట్టణ కమిటీ సమావేశం ఇప్ప సతీష్ అధ్యక్షతన నిర్వహించారు.హన్మకొండ శ్రీధర్ మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పటల్స్ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి కనీస నిబంధనలను పాటించకుండం,ధనార్జిని ధ్యేయంగా పనిచేస్తున్నాయని. వైద్యం కోసం హాస్పిటల్ కి వచ్చిన పెషేంట్లను నిలువు దోపిడీ చేస్తున్నారని, ఇష్టానుసారంగా టెస్ట్ పరీక్షలు, స్కానింగ్, అడ్మిట్ పేర్లతో ఫీజులు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఫీజుల వివరాలు నోటీస్ బోర్డులో పెట్టాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ అవి పాటించడం లేదని, కొన్ని హాస్పిటల్స్ లో నోటీసు బోర్డులో డిస్ప్లే చేసినప్పటికీ ఫీజుల కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారు కొన్ని ప్రవేట్ హాస్పిటల్స్ పిఆర్వోలను పెట్టుకుని ఆర్ఎంపీల దగ్గరికి వెళ్లి మా హస్పటల్స్ కు మీ దగ్గరికి వచ్చే పేషంట్లను పంపిస్తే మీకు కమిషన్ అందిస్తామని చెప్పి ఆర్ఎంపీల ద్వారా వచ్చిన పేషెంట్ల దగ్గర నిలువు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందన్నారు. కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్ మేనేజర్ల పేర్లతో నిర్వహణ చేస్తున్నారని వాటికి ఎలాంటి గుర్తింపు లేదని హస్పటల్ నిర్వహణకు ఉండవలసిన బిల్డింగ్స్, ఫైర్ సేఫ్టీ పార్కింగ్ స్థలాలు లేవని వాహనాలను రోడ్లమీదనే పార్కింగ్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అవసరం లేకున్నా టెస్టుల పేరుతో అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని హాస్పటల్లోనే మెడికల్ షాపు నిర్వహించడం వల్ల డాక్టర్లు రాసిన కంపెనీ మెడిసిన్స్ మా హాస్పిటల్ లోనే తీసుకోవాలని ఒత్తిడి తేస్తు హాస్పటల్ కి ఆపదలో వచ్చే పేషెంట్ల దగ్గర నుండి వేల రూపాయలు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.ఇవన్నీ జరుగుతున్న వైద్య శాఖ అధికారులు పట్టించుకోనట్టు వ్యవహారిస్తున్నారని అన్నారు.నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆసుపత్రులకు సహకరిస్తు ప్రైవేటు హాస్పిటల్స్ వారు చేస్తున్న దోపిడీ లో భాగస్వామ్యం అవుతున్నారని అన్నారు.నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు హాస్పటల్ లపై చర్యలు తీసుకోకపోవాలని, ఐఎంఏ ఆలోచన ఓపి ఫీజు పెంచడం ఆలోచన విరమించుకోవాలని లేకపోతే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు ముందు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పట్టణ కమిటీ సభ్యులు కందికొండ రాజు, ఎండీ ఫరిదా,వజ్జంతి విజయ,బిట్ర స్వప్న, ఉదయగిరి నాగమణి, నర్సింహా రాములు, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version