జర్నలిస్టు ముకేశ్ చంద్రకర్ హత్య పిరికిపంద చర్య.

దోషులను కఠినంగా శిక్షించాలి.

తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ డిమాండ్

భూపాలపల్లి నేటిధాత్రి

చత్తీస్గఢ్ జర్నలిస్టు ముకేశ్ చంద్రకర్ హత్య చేయడం పిరికి పందల చర్య అని,దోషులను కఠినంగా శిక్షించాలి అని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఎన్.యు.జె (ఐ) స్టేట్ ఆర్గనైజింగ్ సెక్ట్రటరీ పావుశెట్టి శ్రీనివాస్,జయశంకర్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్,జిల్లా ప్రధాన కార్యదర్శి జల్దీ రమేష్ లు యూనియన్ తరుపున డిమాండ్ చేశారు.

మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.

వాస్తవాలను వెలికి తీసే జర్నలిస్టులను హత్యాలతో,భౌతిక దాడులతో భయభ్రాంతులకు గురి చేయాలను కోవడం అవినీతిపరుల అవివేకమే అవుతుంది తప్ప,హత్యలు,భౌతిక దాడులకు జర్నలిస్టులు భయపడరనే విషయాన్ని ప్రభుత్వాలు గుర్తుతెరగాలని హెచ్చరించారు.

ప్రభుత్వ యంత్రాంగంలో భాగమైన అవినీతి కాంట్రాక్టర్లు తీరును,వారికి కాపలా కాస్తున్న ప్రభుత్వ యంత్రాంగంను తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ దోషులకు కఠినంగా శిక్షించాల్సిందిగా యూనియన్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.

ఈ దారుణ హత్య వ్యవహారంలో విచారణను వేగవంతం చేసేందుకు కాలపరిమితి విధించాలని,హంతకులను చట్ట ప్రకారం శిక్షించాలని టీ.ఎస్.జే యూ డిమాండ్ చేస్తుందన్నారు.

ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జరల్నిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టం అంశాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ముకేశ్ చంద్రకర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version