ఓటర్ల తుది జాబితాను తయారు చేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

ఓటర్ల తుది జాబితా-2025 ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల వారీగా వివరాలను సోమవారం వెల్లడించారు. నూతన జాబితా తయారీలో భాగంగా గత సంవత్సరం ఆగస్టు 20వ తేది నుంచి అక్టోబరు 18వ తేది వరకు బీఎల్ఓ(బూత్ లెవల్ ఆఫీసర్) ఇంటింటి సర్వే నిర్వహించారు. మృతులు, వలస ఓటర్ల తొలగింపుతో పాటు, ఈ ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువతకు కొత్తగా ఓటుహక్కు కల్పించేందుకు ఫాం-6 దరఖాస్తులు స్వీకరించారు. రెండు నెలల పాటు కొనసాగిన సర్వేతో పాటు.. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులపై విచారణ చేపట్టారు. ఆయా వివరాలతో గతేడాది అక్టోబరు 29న ఓటరు ముసాయిదా జాబితా
విడుదల చేశారు. దీనిపై వచ్చిన అభ్యంతరాలతో పాటు కొత్తగా మార్పులు, తొలగింపునకు వచ్చిన అర్జీలను విచారించి తుది జాబితా 6వ తేదీ సోమవారం ప్రచురించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version