ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆట స్థలాన్ని మినీ స్టేడియంగా మార్చాలి .
సింగరేణి గ్రామ సర్పంచ్ మేదరి టోనీ.
అడిషనల్ కలెక్టర్కు వినతి.
కారేపల్లి నేటిధాత్రి
సింగరేణి మండల కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలోని ఆట స్థలాన్ని మండల క్రీడాకారుల కోసం మినీ స్టేడియంగా అభివృద్ధి చేయాలని సింగరేణి సర్పంచ్ మేదరి వీర ప్రతాప్ (టోనీ) అడిషనల్ కలెక్టర్కు వినతి చేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. దీనిపై అడిషనల్ కలెక్టర్ సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల అధికారి ఎంపీఓ పిఆర్ఏఈ స్థానిక సెక్రటరీ నెహ్రూ మరియు కళాశాల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.
