9వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి
* గడప గడప ప్రచారంలో రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుట్టం పురుషోత్తం రావు పటేల్, జిల్లా అధ్యక్షులు వేల్పుల శ్రీనివాస్
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :
పని చేసేవారికి పట్టం కట్టాలని బి ఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే మంచిరోజులు వస్తాయని రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుట్టం పురుషోత్తం రావు పటేల్, జిల్లా అధ్యక్షులు వేల్పుల శ్రీనివాస్ అన్నారు. మునిసిపల్ ఎన్నికల్లో భాగంగా అలియాబాద్ మున్సిపాలిటీలో ని 9వ వార్డులో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తూము యమున శ్యామ్ పటేల్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా
అలియాబాద్ మున్సిపాలిటీ లో పోటీచేస్తున్నారని కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమం లో ప్రధాన కార్యదర్శి చాట్ల పల్లి నర్సింగ్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిళ్ళ శ్రీనివాస్, కార్యనిర్వాహన కార్యదర్శి ఆకుల సతీష్ తదితరులు పాల్గొన్నారు.
