గాజర్ల రవి అలియాస్ గణేష్ మృతదేహం గ్రామానికి తరలింపు.

గాజర్ల రవి అలియాస్ గణేష్ మృతదేహం గ్రామానికి తరలింపు.

నేడే అంత్యక్రియలు ముగిసిన 33 ఏళ్ల గాజర్ల కుటుంబ ప్రస్థానం.

సెంట్రల్ కమిటీ సభ్యుడు హోదాలో మరణం. జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు.

చిట్యాల నేటి ధాత్రి:

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి చిట్యాల మండలంలోని వెలిశాల గ్రామానికి ఓ చరిత్ర ఉంది ఆ చరిత్ర నేటితో ముగియనుందా అనే సందేహం కలుగుతుంది వెలిశాల తల్లడిల్లుతుంది ఈ ప్రాంతంలో నక్సల్స్ ఉద్యమానికి పురుడు పోసిన గాజర్ల కుటుంబంలో మరొకరు పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందారు, వివరాల్లోకి వెళితే గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ 2008 ఎన్కౌంటర్లో చనిపోగా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుపల్లి అడవుల్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో గాజర్ల రవి అలియాస్ గణేష్ మృతి.

చెందిన విషయం తెలిసిందే దీంతో గాజర్ల కుటుంబ ప్రస్థానం ఉద్యమంలో ముగిసినట్లయింది, రవి మృతదేహం కోసం బయలుదేరిన గాజర్ల అశోక్ అలియాస్( ఐతు) ఆంధ్రప్రదేశ్లోని రంపచోడవరం కు బయలుదేరి మృతదేహాన్ని తీసుకొస్తున్న క్రమంలో చిట్యాల చౌరస్తాలో రవి మృతదేహానికి గౌడ సంఘం నేతలు మరియు తన చిన్ననాటి స్నేహితులు బంధువులు ప్రజలు నివాళులర్పించి రవన్న అమరహే అంటూ నినాదాలు చేశారు ,ఈ సందర్భంగా గాజర్ల రవి అలియాస్ గణేష్ తమ్ముడు అశోక్ మీడియాతో మాట్లాడుతూ డెడ్ బాడీ కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరం అని కావాలని కాలయాపన చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చనిపోయిన శవాలను చూసి భయపడాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి రావడం నిజంగా చాలా దురదృష్టకరం అని కనీసం డెడ్ బాడీనికూడా చూపించడానికి ఉదయం 8 గంటల నుండి వేడుకుంటే రాత్రి 12 గంటలకు డెడ్ బాడీని అప్పజెప్పారు అని ఫోరోనిక్స్ వాళ్ళు లేరని నిర్లక్ష్యం సమాధానం చెబుతూ చాలా కాలయాపన చేశారు అని.
ఈ ప్రాంత పోరాటం కోసం ఎన్నో పోరాటాలు చేసిన రవి మృతదేహాన్ని చూడడానికి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కడసారి చూపు కోసం నోచుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు, డెడ్ బాడీ కోసం ఆంక్షలు పెట్టి ఇచ్చారని ఈ విషయం తెలంగాణ గవర్నమెంట్ కు మరియు పోలీస్ శాఖ వారికి ముందస్తుగా సమాచారం ఇవ్వడం జరిగిందని అట్లాంటి సంఘటనలు ఏమీ జరగవు అని ఈ సందర్భంగా తెలిపారు, కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అభిమానులు అందరూ శుక్రవారం రోజు జరిగే జరిగే అంత్యక్రియలో పాల్గొనాలని అన్నారు, మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించినవారు తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీపతి గౌడ్ ఉపాధ్యక్షులు తడక సుధాకర్ ప్రధాన కార్యదర్శి బుర్ర రమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్ర లక్ష్మణ్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య అభిమానులు బంధువులు తదితరులు ఉన్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version