ఉమ్మడి జిల్లా కోర్ట్ ఆవరణలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
హన్మకొండ/వరంగల్: నేటిధాత్రి (లీగల్):-
హన్మకొండ జిల్లా కేంద్రంలోని ఉమ్మడి జిల్లా కోర్ట్ ఆవరణలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఇట్టి కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి.నిర్మలా గీతంబ మరియు హన్మకొండ జిల్లా ఇంచార్జి న్యాయమూర్తి బి.అపర్ణ దేవి పాల్గొని జెండా ఆవిష్కరించారు.
తదనంతరం ఇరువురు న్యాయమూర్తులు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు మరియు న్యాయవాదులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
తరువాత ఇరు బార్ అసోసియేషన్ల అధ్యక్షులు వలస సుదీర్ మరియు పులి సత్యనారాయణ జెండాను ఆవిష్కరించారు, అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరికీ మరియు న్యాయవాదులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా న్యాయవాదులు తెలంగాణ ఉద్యమంలో తాము పాల్గన్న తీరును గుర్తు చేసుకుంటూ, రాష్ట్ర సాధనలో న్యాయవాదుల పాత్ర అతి ముఖ్య మైనదని, ఉద్యమ ఆరంభం నుండి తెలంగాణ సిద్ధించే వరకు న్యాయవాదులు న్యాయపరమైన అంశాలతో ఉద్యమాన్ని నడిపించారని, న్యాయ వేదికలపై ఉచిత న్యాయపరమైన సేవలు అందిస్తు ప్రజల హక్కుల కోసం పోరాడుతూ, దీక్షలో, నిరసనలో పాల్గొంటూ ఉద్యమాన్ని నడిపిస్తూ, ప్రజలకు తెలంగాణ ఏర్పాటు ఎంత ముఖ్య మైనదో మరియు దాని అవశ్యకత గురించి ప్రజలకు తెలియజేస్తూ ముందు ఉండి, అన్యాయానికి ఎదురు నిలబడి, ప్రజాస్వామ్య విలువలకు బలాన్ని చేకూరుస్తూ నిలబడిన న్యాయవాదుల చరిత్ర తెలంగాణ ఉద్యమానికి ఒక మూలస్తంభంగా నిలుస్తుందని, భవిష్యత్తులోనూ ప్రజలకు న్యాయాన్ని చేరువ చేయడంలో, చట్టాన్ని సమాజ అభివృద్ధికి ఉపయోగించడంలో న్యాయవాదుల భూమిక మరింత గౌరవప్రదంగా ఉంటుందని, తెలంగాణ ఉద్యమ సమయంలో తాము పాల్గొన్న మధుర స్మృతులను న్యాయవాదులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఒకరొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
ఇట్టి కార్యక్రమంలో వరంగల్ మరియు హన్మకొండ బార్ అసోసియేషన్ల ప్రధాన కార్యదర్శులు డి.రమాకాంత్, కె. రవి, మరియు ఇరు బార్ అసోసియేషన్ల కమిటీ మెంబెర్స్, సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, జిపి మరియు ఏజీపిలు మరియు డిఓపి మరియు ఏపిపిలు, కోర్ట్ సిబంది పాల్గన్నారు.