తపస్ ఝరాసంగం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎన్నిక
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ లో శనివారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో తపస్ జిల్లా ఎన్నికల అధికారి పెంటారెడ్డి ఆధ్వర్యంలో
తపస్ ఝరాసంగం మండల అధ్యక్షులుగా టి. మోహన్, ప్రధాన కార్యదర్శి గా కె. స్వరూపరాణి లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని తెల్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో సంగారెడ్డి తపస్ జిల్లా అధ్యక్షులు దత్తాత్రి, ప్రధాన కార్యదర్శి సుధాకర్, డివిజన్ అధ్యక్షులు తుక్కప్ప, సురేష్, కృష్ణ, బాల్ శెట్టి, తదితరులు పాల్గొనడం జరిగింది.
