తాలిపేరు కాలువ పూడికతీత పనులు చేపట్టాలి

బిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్

భద్రాచలం నేటి ధాత్రి

చర్ల దుమ్ముగూడెం మండలాల రైతులకు ప్రధాన ఆయకట్టుగా సాగునీరు అందించే తాలిపేరు ఎడమ కాలువ పూడికతీత పనులు చేపట్టాలని బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ డిమాండ్ చేశారు
తాలి పేరు ఎడమ కాలువ పూడికతీత ఆగిపోవడం వలన వేలాది ఎకరాలకు సాగునీరు అందటం కష్టంగా మారిందని ప్రాజెక్టులో నీరు ఉన్నప్పటికీ కాలవ మరమ్మత్తులు పూడిక తీయకపోవడం ద్వారా నీరు వదలక పోవడం ద్వారా ఆయకట్ట రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని తక్షణమే ఇరిగేషన్ అధికారులు జోక్యం చేసుకొని రైతాంగానికి న్యాయం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ చర్ల మండల నాయకులు తెల్లం లక్ష్మీనారాయణ. ఐనవోలు పవన్ కుమార్. కారం కృష్ణమూర్తి.ఆకోజు సునీల్ కుమార్. సూరిబాబు జగపతి. తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version