ఏఐటీయూసీ బ్రాంచ్ నాయకులు గుర్జేపల్లి సుధాకర్ రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
ఈనెల 30న భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగే సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, ట్రేడ్ యూనియన్ శిక్షణ తరగతులను కార్మికులు పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని ఏఐటీయూసీ సీనియర్ మైనింగ్ స్టాప్ బ్రాంచ్ నాయకులు గుర్జేపల్లి సుధాకర్ రెడ్డి కోరారు. భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-5 ఇంక్లైన్ లో కార్మికులను మైనింగ్ స్టాఫ్ సిబ్బందిని సుధాకర్ రెడ్డి కలిశారు. మైనింగ్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని కార్మికులకు హామీ ఇచ్చారు. అట్లాగే ఈ నెల 31న జరిగే ట్రేడ్స్ మెన్ శిక్షణ తరగతులకు హాజరై శిక్షణ తరగతులు చెప్పే ప్రతి విషయాన్ని అవగతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫిట్ సెక్రటరీ దోర్నాల తిరుపతి, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ పి నారాయణమూర్తి, పి రామన్న, వై ప్రకాష్, కే తిరుపతిరెడ్డి, ఎం శ్రీనివాస్, బి బాబు తదితరులు పాల్గొన్నారు.