కాంగ్రెస్ ప్రభుత్వం లో నీటి ఎద్దడి ఉన్న రైతులకు సాగు నీరు అందిస్తున్నం!!!
ఏర్ వాల్ నీ ఓపెన్ చేసి నీటిని విడుదల చేసిన ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్!!
ధర్మపురి నేటి ధాత్రి
గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ రైతులకు సాగు నీరు అందించే ప్రయత్నం చేయలేదు అని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం లో నీటి ఎద్దడి ఉన్న రైతులకు సాగు నీరు అందిస్తున్నం అని,ఏర్ వాల్ నీ ఓపెన్ చేసి నీటిని విడుదల చేసిన సందర్భంగా ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ అన్నారు ,ధర్మపురి నియోజక వర్గం ధర్మారం మండలం
మేడారం రిజర్వాయర్ నుండి ఎల్లంపెల్లి పైప్ లైన్ ద్వారా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామ ప్రజలకు సాగు,త్రాగు నీరు అందించేందుకు బైరెడ్డి పల్లె వద్ద గల పైప్ లైన్ ఏర్ వాల్ నీ ఓపెన్ చేసి నీటిని విడుదల చేసిన ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.గత ప్రభుత్వంలో మంత్రి గా ఉన్న కొప్పుల ఈశ్వర్ ఏనాడు రైతులకు సాగు నీరు అందించే ప్రయత్నం కూడా చేయలేదని,కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంత నీటి ఎద్దడి ఉన్నప్పటికీ రైతులకు సాగు నీరు అందించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,మరియు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ఈ రోజు రైతులకు సాగు నీటిని విడుదల చేయడం జరిగిందని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి,ఇరిగేషన్ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి గారికి మరియు ఇరిగేషన్ అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని,త్వరలోనే ధర్మపురి నియోజక వర్గ ప్రజానీకానికి సాగు నీరు, త్రాగు నీరు అందించే విషయంలో శాశ్వత పరిష్కారం చూపుతామని ఈ సందర్భంగా తెలిపారు