కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొలి

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధర్నాకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం నుంచి గాంధీజీ పేరును తొలగించడం రాజ్యాంగ విలువలకు, ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. గ్రామీణ పేదల జీవనాధారంగా నిలిచిన ఈ పథకానికి గాంధీజీ పేరు చరిత్రాత్మకంగా అనుసంధానమై ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులు, రైతులు, పేదల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేస్తూ, ఫీల్డ్ అసిస్టెంట్ల హక్కులు, ఉపాధి భద్రత కోసం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version