క్రికెట్ విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్సీ
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని కౌకొండ గ్రామంలో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో
నిర్వహించిన (ఎన్ పి ఎల్ ) నడికూడ ప్రీమియర్ లీగ్ ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ కి హాజరై క్రికెట్ విజేతలకు బహుమతులు అందజేశారు.మొదటి బహుమతి 30000,రెండవ బహుమతి 20000 , మెడల్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అద్భుతమైన క్రీడా ప్రతిభను వెలికితీయడానికి క్రికెట్ టోర్నమెంట్లు గ్రామీణ క్రీడలు దోహదపడతాయి క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తిని చాటాలి యువత క్రీడల్లో రాణించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి జట్టుకు క్రికెట్ క్రీడా సామాగ్రిని అందజేస్తామని తెలిపారు అదేవిధంగా తన ఎమ్మెల్సీ ఫండ్ నుంచి 20 లక్షల నిధులను కౌకొండ గ్రామ అభివృద్ధికి కేటాయిస్తానని హామీ ఇచ్చారు,అదేవిధంగా పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గతంలోనే గ్రామీణ ప్రాంత మహిళలకు కుట్టు మిషన్లు అందజేయడం జరిగింది.ఆత్మకూర్,దామెర మండలాల్లో కుట్టు మిషన్ శిక్షణ ఏర్పటు చేస్తామాన్నరు
పరకాల,నడికూడ మండలాల్లో మరికొన్ని గ్రామాల్లో కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి మిషన్లు అందజేస్తామని తెలిపారు.నాకు జన్మనిచ్చిన నా ఊరు వరికోల్ నా మండలం నడికూడ మండలంను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. భవిష్యత్తులో పరకాల, నడికూడ మండలాల నిరుద్యోగ యువత కోసం కౌకొండ గ్రామంలో యువతకు అవసరమయ్యే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు,వివిధ పరిశ్రమలను ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే.వాసుదేవ రెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియ కో ఆర్డినేటర్ వై.సతీష్ రెడ్డి, కౌకొండ గ్రామ సర్పంచ్ ఓదెల శ్రీలత- భాస్కర్, పోచంపల్లి ఫౌండేషన్ కన్వీనర్ నడికూడ మండల మాజీ వైస్ ఎంపీపీ చందా కుమార స్వామి,
బిఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు మేడిపల్లి శోభన్,ఎన్ పి ఎల్ ప్రీమియర్ లీగ్ నిర్వహకులు రామంచ రాజేందర్,
సుహిదర్(లడ్డు) నడికూడ మండల సమన్వయ సమితి సభ్యులు సుధాటి వెంకటేశ్వరరావు,నందికొండ జైపాల్ రెడ్డి,నందికొండ గణపతి రెడ్డి, కోడెపాక కరుణాకర్, తిప్పర్తి సాంబశివరెడ్డి,కౌన్సిలర్, బొచ్చు బాబురావు,రాకేష్ రావు,వరికోల్ సర్పంచ్ దొగ్గేల కుమారస్వామి,ఉప సర్పంచ్ భుజంగరావు,ఆముదాల పెళ్ళి అశోక్,గంట సమ్మిరెడ్డి, మచ్చా రవీందర్,పిఎసిఎస్ మాజీ చైర్మన్ నల్లెల లింగమూర్తి,మేకల సతీష్, లింగాల తిరుపతి,ముక్కెర రాజు,పోశాల అశోక్, రఘుపతి,శివ,నరేష్, మల్లికార్జున్,ప్రశాంత్ రెడ్డి, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
