ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు…
◆-: జహీరాబాద్ మండల్ ఎక్స యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ హోలియ దాసరి రాములు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్, పట్టణంలో యూత్ కాంగ్రెస్ ఎక్స్ జహీరాబాద్ మండల్ అధ్యక్షుడు మేకల రాములు ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాసం ఉపవాసాలు 17వ రోజులు పూర్తి అయిన సందర్భంగా జహీరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో ముస్లిం యువత ఎక్కువగా ఉపవాసాలు ఉండే అవకాశం ఉందన్నారు. ప్రతి ముస్లిం ఈ పవిత్ర రంజాన్ మాసంలో జకాత్ ఇవ్వటం ఆనవాయితీ అన్నారు. తద్వారా పెద ముస్లింలు కూడా పండుగ సంతోషంగా చేసుకునే అవకాశం కల్పించినట్లు అవుతుందన్నారు. జకాత్ ఇవ్వడం ప్రతి ముస్లిం కనీస ధర్మం అన్నారు. జకాత్ స్వీకరించడానికి వచ్చే ముస్లింలను ఆదరించాలని కోరారు. పవిత్ర రంజాన్ మాసంలో పేదలకు సహాయ సహకారాలు అందించడం ద్వారా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు పొంది అల్లాహుతాలు కృపకు పాత్రులవుతారని పిరానీ పీర్ గౌసే ఆజం దస్తగీర్ జెండా ఘనంగా రంజాన్ పండగ వేడుకలు జరుపుకుంటారని యూత్ కాంగ్రెస్ జహీరాబాద్ మండల్ మాజీ అధ్యక్షుడు హోలియా దాసరి రాములు అన్నారు.
