అరైవ్ అలైవ్ కార్యక్రమం మన ఊరు మన భద్రత మన బాధ్యత
ఎస్సై పరమేష్
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం మాం దారిపేట ప్రధాన రహదారిపై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వ హిస్తున్న అరైవ్ అలైవ్ కార్య క్రమంలో భాగంగా ఎస్సై వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అవ గాహన కార్యక్రమం చేపట్టారు. ఎస్సై మాట్లాడుతూ రోడ్డు భద్రత, సైబర్ నేరాల నివా రణ, డ్రగ్స్ నియం త్రణ సీసీ టీవీ కెమెరాల ప్రాముఖ్యతపై విస్తృతంగా అవగాహన కల్పించారు. జిల్లా,మండల, గ్రామ స్థాయిలో ఉన్న యువ త ఎక్కువగా రోడ్డు ప్రమా దాలకు గురవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క ద్విచక్రవా హనం కలిగి ఉన్న వాహన దారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి.ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
