సీఎం కప్ టోర్నమెంటు రాష్ట్ర స్థాయి పోటీలకు విజ్ఞాన భారతివిద్యార్థులు..

సీఎం కప్ టోర్నమెంటు రాష్ట్ర స్థాయి పోటీలకు విజ్ఞాన భారతివిద్యార్థులు

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

క్రమశిక్షణతో కూడిన లక్ష్యసాధన ఉంటే ఎంతటి విజయమైన సాధ్యమైతుందని ప్రైవేట్ (ట్రస్మా )స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోనె హనుమంత రెడ్డి, విజ్ఞాన భారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరస్పాండెంట్ బీ జంగారెడ్డి అన్నారు. జిల్లా స్థాయిలో జరిగినటువంటి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజ్ఞాన భారతి పాఠశాల తుంకుంట విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. దీంతో బుధవారం విద్యార్థులను పాఠశాలలో అభినందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అండర్ -14 లాంగ్ టెన్నిస్ లో పి.ఆంజలీనా, ఏ.రాజీవ మైత్రి అండర్- 16 వెయిట్ లిఫ్టింగ్ లో, బి రుద్ర ఆదిత్య, అండర్ -18 కోకోలో వి.హేమలత, జి నిహారిక లు రాష్ట్ర స్థాయి లో జరిగే సీఎం కప్ టోర్నమెంటులో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గోనే సంగీత, పిఈటీ మహేష్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version