అక్రమ పశువదశాల పట్టించుకోని అధికారులు.
◆-: అనుమతులు లేకుండా నిర్వహణ…..
◆-: స్థానిక అధికారులతో కుమ్మక్కు……
◆-: మాంసం విక్రయ జీరో దందా…..
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం లోని నాల్కల్ మండలంలో అక్రమ పశువాదశాల కొనసాగుతున్న అధికారులు పట్టించు కోవడంతీలేదని తెలిసింది. న్యాల్కల్ మండలం మల్లీ గ్రామ శివారులో వెలసిన ఈ పశువర్ధశాల లో బర్రెలు ఆవులు ఎడ్లు వధించి వాటి మాంసాన్ని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో పరిసర ప్రాంతమంతా దుర్గంధం వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ పశువాదశాల కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉండటం వల్ల అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ పశువాదశాల నుండి మాంసాన్ని హైదరాబాద్ బీదర్ జహీరాబాద్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ పశువాదశాలలో పరిసర ప్రాంతాల్లో కాకుండా వేరే ప్రాంతాల్లో కూడా ఏవైనా పశువులు చనిపోతే వాటిని తీసుకువచ్చి వాటిని మాంసాన్ని కూడా ఎగుమతి చేస్తున్నారు.
పశువుల తో పాటు కుక్కలను కూడా తీసుకువచ్చి వాటి మాంసాన్ని కూడా మేక మాంసంల హైదరాబాద్ తో పాటు వివిధ పట్టణాలకు మేక మాంసంల ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. బీదర్ కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన మల్లీ న్యాల్కల్ మండలం కు చెందిన శివారులో ఈ పశువాదశాల ఉండటం వల్ల ఎలాంటి సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరైనా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వెళ్లి వాటి గురించి అడగగా వారిని బెదిరింపులకు గురి చేస్తూ గుండాయిజం చేస్తున్నట్లు పరిసర ప్రాంతాల ప్రజలు తెలిపారు. ఈ పశువాదశాల గురించి అధికారులకు గ్రామ ప్రజలు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ పశువాదశాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఈ ప్రాంతానికి పోలీసులు కూడా వెళ్లడం లేదని అటువైపు కన్నెత్తి కూడా చూడరని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఏది ఏమైనాప్పటికీ ఈ పశువాదశాల నుండి ప్రతిరోజు టన్నులకొద్దీ మాంసాన్ని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నప్పటికీ ఇలాంటి ప్రభుత్వానికి టాక్స్ కూడా చెల్లించకపోవడంతో ప్రభుత్వ ఖజానాకు కూడా గండి పడుతుంది. ఏది ఏమైనా పనికి జిల్లా కలెక్టర్ అధికారులు స్పందించి మళ్లీ గ్రామంలో ఉన్న ఈ పశువాదశాలను తొలగించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
