ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
ఎంపీఓ శ్రీపతి బాబురావు
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలం నర్వ గ్రామం పంచాయతీలో ఎంపీఓ శ్రీపతి బాబురావు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించారు.గ్రామంలో త్రాగునీటి సమస్యలపై అధికారులతో చర్చించి, సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి ఆదేశించారు.అలాగే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడి, ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మాణం పనులను కూడా ఆయన పరిశీలించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆగిడి స్రవంతి,పంచాయతీ కార్యదర్శి రమాదేవి,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
