బీసీ సంఘం చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుడిగా.!

బీసీ సంఘం చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుడిగా బండమీది వెంకటయ్య

శంకర్‌పల్లి: నేటి ధాత్రి:

 

శంకర్‌పల్లి మండలం మోకిల గ్రామానికి చెందిన బండమీది వెంకటయ్య బీసీ సంఘం చేవెళ్ల నియోజకవర్గం అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సభ్యుడు, సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చేతుల మీదుగా మంగళవారం నియామక ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బండమీది వెంకటయ్య మాట్లాడుతూ సంఘం బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని, తన నియామకానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆర్.కృష్ణయ్యను బండమీది వెంకటయ్య శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో గౌండ్ర సత్యం, శ్రీనివాస్ ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version