బీసీ సంఘం చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుడిగా బండమీది వెంకటయ్య
శంకర్పల్లి: నేటి ధాత్రి:
శంకర్పల్లి మండలం మోకిల గ్రామానికి చెందిన బండమీది వెంకటయ్య బీసీ సంఘం చేవెళ్ల నియోజకవర్గం అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సభ్యుడు, సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చేతుల మీదుగా మంగళవారం నియామక ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బండమీది వెంకటయ్య మాట్లాడుతూ సంఘం బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని, తన నియామకానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆర్.కృష్ణయ్యను బండమీది వెంకటయ్య శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో గౌండ్ర సత్యం, శ్రీనివాస్ ఉన్నారు.