18న మరసం ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం..

18న మరసం ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి )

https://youtu.be/NoviIp1TUK4?si=EohsYI-9HsxUTNf_

 

 

శ్రీ పరాభవ నామ ఉగాది పర్వదినం సందర్భంగా మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు కవి సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు మారసం అధ్యక్ష కార్యదర్శులు గంట్యాల భూమేష్, ఆడేపు లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా కేంద్ర గ్రంథాలయ భవనంలో సమావేశ మందిరంలో జరిగే ఈ కవి సమ్మేళనానికి మునిసిపల్ చైర్ పర్సన్ శ్రీమతి జిందం కళా చక్రపాణి గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల డిఎస్పి కత్రోజు నాగేంద్ర చారి,సుప్రసిద్ధకవి జూకంటి జగన్నాథం , తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు కొండి మల్లారెడ్డి , ప్రముఖ కథా రచయిత పెద్దింటి అశోక్ కుమార్ అతిథులుగా హాజరవుతున్నారు. ఎంపిక చేసిన కవులు తమ కవిత గానాలను వినిపించిన అనంతరం పాల్గొన్న ప్రతి కవికి మారసం పక్షాన ఉగాది సత్కారం ఏర్పాటు చేశామన్నారు సాహిత్య ప్రియులు కవిత ప్రేమికులు పెద్ద సంఖ్యలో హాజరై కవి సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని సంఘం కార్యనిర్వాహక అధ్యక్షురాలు డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ కోరారు.

సిససా ఆధ్వర్యంలో 17న ఉగాది కవి సమ్మేళనం…

సిససా ఆధ్వర్యంలో 17న ఉగాది కవి సమ్మేళనం

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని పరాభవనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు సమితి గౌరవ అధ్యక్షులు పోరండ్ల మురళి ధర్ తెలిపారు.బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఈనెల 17న గాంధీ నగర్ లోని శ్రీ భక్త ఆంజనేయ ఆలయంలో ఉదయం 10 గంటలకు నిర్వహించే కవి సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి హాజరు కానున్నారు.ఈ కవి సమ్మేళనంలో పాల్గొనే కవులకు రచయితలకు, ఉగాది పురస్కారంతో పాటు సన్మానం చేయడం జరుగుతుందన్నారు.
ఈ ఉగాది కవి సమ్మేళనంలో కవులు,రచయితలు పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు చింతోజు భాస్కర్, రచయితలు నేరోజీ రమేష్, సి.సా. స ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ లు
పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version