ఉపాధ్యాయుల సమస్యల కోసం టియుటిఎఫ్ కృషి…

ఉపాధ్యాయుల సమస్యల కోసం టియుటిఎఫ్ కృషి

ఉపాధ్యాయుల పదోన్నతులు పారదర్శకంగా చేపట్టాలి.

ఘనంగా టియుటిఎఫ్ ఆవిర్భావ వేడుకలు.

నర్సంపేట,నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి టియుటిఎఫ్ సంఘం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దార గణేష్ పేర్కొన్నారు.నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 2011ఆగస్టు 7 న ఏర్పడి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిందన్నారు.టియుటిఎఫ్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గురువారం నర్సంపేట మండల కేంద్రంలో ఆ సంఘం ఆధ్వర్యంలో
వేడుకలు ఘనంగా నిర్వహించి టియుటిఎఫ్ పతాకాన్ని ఎగురవేశారు.
ఉపాధ్యాయుల పదోన్నతులు ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా పారదర్శకంగా చేపట్టాలని టియుటిఎఫ్ మండల శాఖ అధ్యక్షులు సందినేని వేంకటేశ్వర్ రావు ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఎన్.ఇంద్రారెడ్డి, కోశాధికారి పి.కవిత, ఉపాధ్యాయులు పత్తి నరసింహారెడ్డి, బోడ రమేష్,రేవూరి కృష్ణారెడ్డి,అంబటి సత్యనారాయణ రాజు,గుండె లక్ష్మయ్య, అనిరుధ్ యాదవ్ తదతరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version