ఏసీబీ వలలో అవినీతి తిమింగళం…

ఏసీబీ వలలో అవినీతి తిమింగళం

* 4లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబికి పట్టుబడ్డ చేవెళ్ల మున్సిపాలిటీ టౌన్ ప్లాన్ ఇంచార్జ్, నార్సింగ్ టౌన్ ప్లానింగ్ అధికారిని మణిహారిక

చేవెళ్ల, నేటిధాత్రి:

 

 

 

 

చేవెళ్ల మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిని, నార్సింగ్ మున్సిపాలిటీ టౌన్ ప్లానర్ మణిహారిక 4లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడింది. మంచిరేవుల లోని వినోద్ అనే వ్యక్తి కి చెందిన ప్లాట్ కు ఎల్ ఆర్ ఎస్ క్లియర్ ప్రక్రియను మొదలుపెట్టటానికి నార్సింగ్ మున్సిపాలిటీ టౌన్ ప్లానర్ మణిహారిక 10 లక్ష డిమాండ్ చేసింది.

 

 

 

 

4లక్షలకు ఒప్పందం కుదిరింది. నిహారిక భారీగా కొంచెం డిమాండ్ చేయడంతో ప్లాట్ ఓనర్ వినోద్ ఏసిబి అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం వినోద్ నుండి 4 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం నార్సింగ్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ డిఎస్పి శ్రీధర్ ఆధ్వర్యంలో సోదాలు చేశారు.నిందితురాలు టౌన్ ప్లానింగ్ అధికారిని మణిహారికను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అవినీతి నిరోధక విభాగం ప్రజాసంబంధాల అధికారి పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా ప్రభుత్వ అధికారి లంచం కోసం డిమాండ్ చేస్తే ప్రజలు 1064 నెంబర్‌కు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా వాట్సాప్, ఫేస్‌బుక్‌, ట్విట్టర్ ద్వారా కూడా ఫిర్యాదు చేయాలని ఏసీబీ డిఎస్పి శ్రీధర్ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version