నేతలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 2 :
నూతన సంవత్సరం రాష్ట్ర ప్రజలకు శాంతి, అభివృద్ధి, సంక్షేమం తీసుకురావాలని, సేవలు మరింత ఫలప్రదంగా కొనసాగాలని ఆకాంక్షింస్తూ మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డిని అలియాబాద్ మున్సిపాల్ కాంగ్రెస్ పార్టి అద్యక్షులు తుంకి రమేష్ కమిటీ సభ్యులతో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ తుంకి భిక్షపతి, మాజీ సర్పంచ్ ఏళ్ల మల్లేష్, మాజీ ఎంపీటీసీ సరసం అశోక్ రెడ్డి, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి కంఠం కృష్ణ రెడ్డి, ఉపాధ్యక్షులు భూమి రెడ్డి నవీన్ రెడ్డి, చట్లపల్లి నర్సింగ రావు, అబ్బగౌని భాస్కర్ గౌడ్, ముద్దం రాఘవ రెడ్డి, మణికొండ నవీన్, వారాల మహిపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, నాటకారి బాబు, వల్లపు మహేష్, లింగోళ్ల శ్రీకాంత్ గౌడ్, పిట్ల నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
