భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ – 2025” సదస్సుకు ఆహ్వానం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. డిసెంబర్ 8–9 తేదీలలో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025″కు కావాల్సిందిగా ఖర్గే గారిని సాదరంగా ఆహ్వానించారు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విజన్, భవిష్యత్తు ప్రణాళికలను ప్రపంచానికి పరిచయం చేయడానికి గ్లోబల్ సమ్మిట్ ఒక కీలక వేదికగా నిలవనుంది. రాష్ట్రంలో చేపట్టనున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడి అవకాశాలు, దీర్ఘకాలిక లక్ష్యాలతో కూడిన “తెలంగాణ రైజింగ్ 2047” రోడ్మ్యాప్ను కూడా గ్లోబల్ సమ్మిట్ వేదికపై ఆవిష్కరించనున్నారు.ఖర్గే గారితో సమావేశంలో ముఖ్యమంత్రి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పలువురు పార్లమెంటు సభ్యులు మరియు జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ పాల్గొన్నారు.
