కల్తీ కల్లు బలి: చేవెళ్లలో ఒకరి మృతి

ప్రాణం తీసిన కల్తీ కల్లు

• చేవెళ్ల మండలంలో కల్తీ కల్లు అరాచకం
• కల్తీ కల్లుకు ఒకరు బలి
• అమాయక ప్రజల ప్రాణాలు బలిగొంటున్న కల్తీ కల్లు
• అడ్డదారిలో వసూళ్ల ఆరోపణలలో ఎక్సైజ్ సీఐ
• గల్లీకో బెల్ట్ షాప్ గ్రామానికో కల్తీ కల్లుదుకాణం
• చేవెళ్ల ఎక్సైజ్ సీఐ కనుసన్నలోనే కల్తీకల్లు ఆరోపణలు
• మామూళ్లమత్తులో జోగుతున్న చేవెళ్ల ఆబ్కారీ
• కల్తీకల్లుపై కనిపించని అధికారుల నిఘా
• సీహెచ్‌, ఆల్ఫాజోలం కలుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం

చేవెళ్ల, నేటిధాత్రి:

 

 

చేవెళ్ల మండలంలో కల్తీ కల్లు మాఫియా రాజ్యమేలుతోంది.
మంగళవారం చేవెళ్ల మున్సిపల్ పట్టణణానికి చెందిన దామరగిద్ద నర్సిములు వయస్సు( 64 )ధర్మసాగర్ కల్లు తాగి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో చేవెళ్ల పట్టణకేంద్రంలో హాఠత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లి కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం నర్సిములు మంగళవారం ఉదయం 7 గంటలకు కళ్లుతాగడానికి వెల్లాడని నర్సిములు కూతురు సంతోష తెలిపింది. కాని ఉదయం 11 గంటల సమయంలో కల్లు తాగి, వెంట కల్లు ప్యాకెట్లు తీసుకుని ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో కుప్పకూలి మృతిచేందడని తెలి.

ధనార్జనే ద్యేయంగా ప్రమాదకరమైన క్లోరోహైడ్రేడ్‌(సీహెచ్‌), ఆల్ఫాజోలం, డైజోఫామ్‌ వంటి మత్తు పదార్థాలతో ధర్మసాగర్ లో కల్తీ కల్లు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలను తోడేస్తున్నారు. మామూళ్ళకు అలవాటు పడిన కొందరు ఆబ్కారీ అధికారులు ఈ నిర్వాహకులతో అంటకాగుతూ మొక్కుబడి దాడులతో ప్రజల ప్రాణాలు తీయడంలో పరోక్ష పాత్ర పోషిస్తున్నారంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చేవెళ్ల మండలంలో పరిధిలోని ధర్మసాగర్ కల్లు

 

లిక్కర్ తో పోటీపడి అంతకు మించిన కిక్కు కోసం ప్రాణాలు తీస్తున్నారు కల్తీ కల్లు నిర్వాహకులు. ఇప్పటికే ఈ కల్లుతాగి ఎంతోమంది అమాయకులు వేరు వేరు సంఘటనలో ( రోడ్డు ప్రమాదం,కుప్పకూలి , హటాత్తు మరణాలు) ధర్మసాగర్, కందవాడ, పలు కల్లు కంపౌండ్‌లలో విచ్చల విడిగా నిషేధిత మత్తు పదార్థాలు కలుపుతున్నారనే ఆరోపణలు వస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే కల్తీ కల్లు తాగి మృత్యువాత పడుతునట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

• చేవెళ్ల అబ్కారి సీఐ కనుసన్నలోనే కల్తీకల్లు

చేవెళ్ల ఎక్సైజ్ సీఐ శ్రీలత ఛార్జ్ తీసుకున్నప్పటి నుండి
కల్లు మాఫియా రెచ్చిపోతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేవెళ్ల మండలంలో పలు కల్తీ కల్లు కంపౌండ్‌ల వెనక అబ్కారి సీఐ అండదండలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మృతిచెందిన కల్తీ కల్లు నిర్వాహకులు యతేచ్చగా కల్లు విక్రయాలు కొనసాగిస్తున్నారనే ప్రచారం సాగుతుంది. చేవెళ్ల పరిసర ప్రాంతాల్లో గత కొంత కాలంగా ధర్మసాగర్, కందవాడ కల్లు కంపౌండ్‌లలో జోరుగా కల్తీ కల్లు విక్రయాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఎన్నో కల్తీ కల్లు ఘటనలు చోటుచేసుకున్నా చేవెళ్ల ఎక్సైజ్ శాఖ అధికారుల తీరులో మార్పు రాకపోవడం గమనార్హం. కల్తీ కల్లు నిర్వాహకులపై కేసులు నమోదు చేసి,చేవెళ్ల ఎక్సైజ్ సీఐ శ్రీలతపై ఉన్నతధికారులు చర్యలు తీసుకుని సస్పెండ్ చెయ్యాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version