గుడుంబా స్థావరాలపై పోలీస్–ఎక్సైజ్ శాఖల సంయుక్త దాడులు…

గుడుంబా స్థావరాలపై పోలీస్–ఎక్సైజ్ శాఖల సంయుక్త దాడులు

1500 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం

70 లీటర్ల నాటుసారా స్వాధీనం

మంచిర్యాల,నేటి ధాత్రి:

కోటపల్లి మండలం అల్గాం గ్రామంలో బుధవారం కోటపల్లి పోలీసులు,ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు.గ్రామంలోని గుడుంబా ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటికీ తనిఖీలు నిర్వహించి గుడుంబా తయారీ కేంద్రాలను గుర్తించి ధ్వంసం చేశారు.ఈ సందర్భంగా దాదాపు 1500 లీటర్ల బెల్లం పానకాన్ని స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే పారబోశారు.అలాగే నలుగురు మహిళల వద్ద నుంచి 70 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని వారిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ కృష్ణ తెలిపారు.ఈ సందర్భంగా చెన్నూరు రూరల్ సీఐ కృష్ణ మాట్లాడుతూ గుడుంబా అనే మహమ్మారి కారణంగా అనేక మంది యువకులు వ్యసనపరులై ప్రాణాలు కోల్పోతున్నారని,దీని వల్ల అనేక కుటుంబాలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామంలో ఎవరైనా గుడుంబా తయారీ,విక్రయం లేదా దానికి అవసరమైన ముడి సరుకుల సరఫరా చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అలాగే నాటుసారా తయారీలో ఉపయోగించే పాత్రలు,డ్రమ్ముల విక్రయాలపై కూడా ప్రత్యేక నిఘా ఉంచుతామని స్పష్టం చేశారు.గ్రామాలను గుడుంబా రహితంగా తీర్చిదిద్దేందుకు గ్రామ సర్పంచ్‌లు ముందడుగు వేయాలని,గ్రామస్థుల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి గుడుంబా నిషేధ తీర్మానాలు చేయాలని సీఐ కోరారు.ప్రజలందరూ పోలీసులకు సహకరించి గుడుంబా నిర్మూలనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ దాడుల్లో జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సీఐ సమ్మయ్య,కోటపల్లి ఎస్సై రాజశేఖర్,ఎక్సైజ్ ఎస్సై వెంకటరమణతో పాటు పోలీస్,ఎక్సైజ్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

 

400 కేజీల గుడుంబా బెల్లం పటిక పట్టివేత…

400 కేజీల గుడుంబా బెల్లం పటిక పట్టివేత

బెల్లం,పటిక,కారు స్వాధీనం..నిందితుడి అరెస్ట్

నాటు సారా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవు

నర్సంపేట ఎక్సైజ్ సిఐ నరేష్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

నిషేధిత అక్రమ గుడుంబా తయారి కోసం రవాణా చేస్తున్న 100 కిలోల బెల్లం 300 కిలోల పటిక, ఐదు లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు నర్సంపేట ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి తెలిపారు. ఏ నరేష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ డివిజన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు,జిల్లా ఎక్సైజ్ అధికారి అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు నర్సంపేట పరిధిలో నాటుసారా నియంత్రణ కొరకు ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు.ఈ సందర్భంగా నర్సంపేట మండలంలోని ముత్తోజిపేట ప్రధాన రహదారిపై విస్తృత తనిఖీలను చేపట్టగా నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డిపల్లెకు చెందిన బానోతు రాజన్న @ టీక్య అనే వ్యక్తి కారును అనుమానంతో తనిఖీలు చేయగా కారులో బెల్లం,పట్టిక,నాటుసారా లభ్యమైంది.కాగా అతని వద్ద నుండి 300 కేజీల పట్టిక ,100 కేజీల బెల్లం, ఐదు లీటర్ల నాటుసారా, టాటా విస్టా కారు, ఒక మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగిందన్నారు. నిందితుడు పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అనంతరం సిఐ నరేష్ రెడ్డి మాట్లాడుతూ నిషేధిత నాటుసార తయారుచేసిన విక్రయించిన చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖ రూల్స్ ప్రకారం గుడుంబా తయారు చేసిన,విక్రయించిన ప్రభుత్వం నుండి అందించే సంక్షేమ పథకాలు రద్దు చేయాల్సి ఉంటుందని సిఐ సూచించారు.ఈ తనిఖీలలో నర్సంపేట ఎక్సైజ్ ఎస్సై శార్వాణి, సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version