బిజెపి సేవా పక్షం మండల కన్వీనర్ గా ఆడెపు విక్రమ్…

బిజెపి సేవా పక్షం మండల కన్వీనర్ గా ఆడెపు విక్రమ్
కో కన్వీనర్లుగా తాటికాయల ఆనందం పులి సాగర్ నియామకం
ప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్భంగా 15 రోజులు సేవా కార్యక్రమాలు
దేశవ్యాప్తంగా కమిటీలను నియమించిన బిజెపి అధిష్టానం

నేటి ధాత్రి అయినవోలు :-

 

 

 

సెప్టెంబర్ 17 న ప్రధాని నరేంద్ర మోదీ 75 వ జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ జాతీయ కమిటీ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించడం జరిగింది. ఈ ఈ కార్యక్రమాలను సమన్వయపరిచేందుకుగాను ప్రతి మండలానికి ఓ సేవా కమిటీని నియమించింది. అందులో భాగంగానే మంగళవారం నిర్వహించిన సమావేశంలో అయినవోలు మండలం కన్వీనర్ గా ఆడెపు విక్రం,ను కొ కన్వీనర్లుగా తాటికాయల ఆనందం, పులి సాగర్ గౌడ్ లను నియమించినట్లు జిల్లా కన్వీనర్ కనుకుంట్ల రంజిత్ తెలిపారు . ఈ ఈ సందర్భంగా ఆడెపు విక్రమ్ మాట్లాడుతూ, మూడు పర్యాయాలు ఏకచక్రాధిపత్యంగా దేశ ప్రధానిగా ఎన్నికై ప్రజలందరి మన్ననలు పొంది దేశాన్ని సుభిక్షంగా పాలిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు అంటే దేశ ప్రజలందరికీ పండుగ రోజు ప్రధాని మోడీ నిస్వార్ధ సుపరిపాలనకు కృతజ్ఞతగా 15 రోజులపాటు జరిగే ఈ మహత్తర కార్యక్రమానికి అయినవోలు మండల కన్వీనర్ గా నన్ను ఎంపిక చేశారంటే ఇన్నాళ్లు నేను చేసిన సేవలకు ఇది గుర్తింపుగా నేను భావిస్తున్నను. అంతేకాకుండా నాకు ఈ బాధ్యత ఇచ్చిన జిల్లా కన్వీనర్ కనుకుంట్ల రంజిత్ కి మరియు మండల అధ్యక్షులు మాదాసు ప్రణయ్ కి విక్రమ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version