మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మర్రిగడ్డ లో “ఊయల మరియు జారుడు బల్ల” ప్రారంభించిన సర్పంచ్ దూది మనీషా శ్రీనివాస్ రెడ్డి
చందుర్తి, నేటిధాత్రి:
ఈ రోజు మర్రిగడ్డ ప్రాథమిక పాఠశాల లో విద్యార్థుల కొరకు ఏర్పాటు చేసిన “ఊయల మరియు జారుడు బల్ల” ను గ్రామ సర్పంచ్ శ్రీమతి దూది మనీషా శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.స్థానిక ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేయుచున్న శ్రీ ఆకుల గంగనర్సయ్య దీనిని విరాళంగా అందించారు.ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడప రఘుపతి రావు మాట్లడుచు చిన్నారుల కొరకు వీటిని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని,పాఠశాల అవసరాలు తీర్చడంలో ఉపాధ్యాయులు కూడా తమ వంతు సహకారం అందిస్తారనడానికి నిదర్శనం ఈ ఊయలలు అని అన్నారు.అనంతరం దాత ఆకుల గంగనర్సయ్య కు మరియు బదిలీలలో చందుర్తి పాఠశాలకు వెళ్లిన గుర్రం బాలకిషన్ కి సర్పంచ్, చందుర్తి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు లచ్చిరెడ్డి,ఉపసర్పంచ్,అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు షకీరా మరియు ఉపాధ్యాయ బృందం చే సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమములో చందుర్తి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లచ్ఛిరెడ్డి, స్థానిక ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్, ఉప సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి,వార్డు సభ్యులు,
ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు బండ శంకర్,కీర్తి,ఉన్నత పాఠశాల ఉపాద్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
