ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభాశిస్సులు..

ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభాశిస్సులు

◆-: బిజెపి నాయకుడు పాలెంకార్ సంతోష్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్,ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షలు వ్రాసే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ విద్యార్థిని, విద్యార్థులకు బిజెపి నాయకుడు పాలెంకార్ సంతోష్ “ఆల్ ది బెస్ట్ చెప్పారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థిని విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో రాయాలని మీరు కష్టపడి చదివిన దాన్ని ఇష్టంతో రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరు కుంటున్నాను అని మీ మంచి భవిష్యత్తుకి ఇది పునాది లాంటిదని పరీక్షలు బాగా రాసి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చివారి యొక్క కలలను నిజం చేయాలని వారు ఆకాంక్షించారు. అదే విధంగా మంచి ఉత్తీర్ణత సాధించి తల్లి తండ్రులకు, మీ అధ్యాపకులకు మంచి పేరు తీసుకరావాలన్నారు.

ఆల్ ది బెస్ట్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభాశిస్సులు ..

ఆల్ ది బెస్ట్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభాశిస్సులు ..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ఈరోజు నుండి 25/2/2026 ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా జహీరాబాద్ నియోజకవర్గంలోని విద్యార్థినీ, విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సిద్దం ఉజ్వల్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రతి విద్యార్థి జీవితంలో ఒక కీలకమైన మలుపు అని పేర్కొన్నారు. మీరు ఏడాది కష్టపడి చదివిన పాఠాలను ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో రాయాలని సూచించారు. పరీక్షల సమయంలో ఆందోళనకు లోనుకాకుండా ప్రశాంతంగా ప్రతి ప్రశ్నకు సమాధానాలు ఇవ్వాలని కోరారు.
మీ శ్రమే మీ విజయానికి బాటవేస్తుంది. మంచి ఫలితాలు సాధించి మీ తల్లిదండ్రులకు, గురువులకు గర్వకారణం కావాలి. ఈ పరీక్షలు మీ భవిష్యత్తు లక్ష్యాలకు పునాది రాయిలాంటివి. పట్టుదలతో ముందుకు సాగితే విజయం మీ సొంతమవుతుంది అని తెలిపారు.జహీరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version