ఆయ్.. హ్య‘ఫ్రీ’ అండి.. కిటకిటలాడుతున్న ఆర్టీసీ బస్లు
రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం పట్ల మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం ప్రారంభించి నాలుగు నెలల్లో మొత్తం రూ. 4 కోట్ల వరకు మహిళలకు డబ్బు ఆదా అయినట్టు ప్రభుత్వ లెక్కలు తెలుపుతున్నాయి.
ఉచిత బస్ పథకం పథకాన్ని మహిళలు అంతలా ఉపయోగిస్తున్నారు. అందుకే ఎక్కడా బస్లు ఖాళీ ఉండ డంలేదు. మగవాళ్లు టిక్కెట్ తీసుకుని ఖాళీ లేక ఇక్కట్లు పడుతుంటే.. మహిళలు మాత్రం ఉచిత బస్ ప్రయాణం సాఫీగా చేసేస్తున్నారు.ఈ ఏడాది మహిళలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన బంపర్ బొనాంజా ‘స్త్రీ శక్తి’ అని రుజువవుతోంది. ఏ బస్సు చూసి నా మహిళలు ఫుల్గా ఉంటున్నారు. ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభించగా ఇప్పటి వరకూ ఉమ్మడి తూర్పుగోదా వరిలో రూ.100 కోట్లకు పైగానే మహిళలకు ఆదా అయ్యింది. ఈ డబ్బు లు మహిళల తరపున ఆర్టీసీకి ప్రభుత్వం జమ చేస్తుంది. చేతిలో పైసా లేకపోయినా బస్సెక్కి రయ్మని వెళ్లొచ్చేస్తున్నారు ఎంచక్కా!.
పథకం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ మొత్తం 4.50 కోట్ల మంది ప్రయాణించగా అం దులో 3 కోట్లు స్త్రీ శక్తి వాటాగా ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు రూట్లు నడిచే బస్సులు మహిళా ప్రయాణికులతో కిక్కిరిసి పోతున్నాయి. ఓ రకంగా ఇతర ప్రయాణికులు ఎక్కే అవకాశమే ఉండడం లేదు. తూర్పు గోదావరిలో రాజమహేంద్రవరం నుంచి తుని, కాకినాడ వయా బిక్కవోలు,రాజానగరం, ఏలూ రు, రామచంద్రాపురం, సీతానగరం, కాకినాడ జిల్లాలో తుని, రావులపాలెం, రాజమహేంద్ర వరం, కోనసీమలో అమలాపురం నుంచి రాజమహేంద్రవరం, రాజోలు, రామచంద్రాపు రం, రాజోలు నుంచి రాజమహేంద్రవరం రూట్లు రద్దీగా ఉండడంతో ఎక్కువ బస్సులు నడపాల్సి వస్తోంది.
