శింబు మానాడు-2.. కాంబినేషన్ రిపీట్!

శింబు మానాడు-2.. కాంబినేషన్ రిపీట్!

 

 

శింబు, వెంకట్ ప్రభు కాంబినేష‌న్‌లో నాలుగేండ్ల క్రితం వ‌చ్చి సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం మానాడు.

హీరో శింబు (Simbu), వెంకట్ ప్రభు (Venkat Prabhu)కాంబినేష‌న్‌లో నాలుగేండ్ల క్రితం వ‌చ్చి సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం మానాడు (Maanaadu).
హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ న‌టించిన ఎడ్జ్ ఆఫ్ టుమారో త‌ర‌హా టైమ్ లూప్ క‌థ‌ నేప‌థ్యంలో తెర‌కెక్కిన
ఈ మూవీ క‌రోనా త‌మిళ ప్రేక్ష‌కుల‌ను ఓ ఊపు ఊపింది.
ఆపై తెలుగులోనూ ఓటీటీ ద్వారా ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌కు చేరువైంది..
ఈ చిత్రం వ‌చ్చి నాలుగేండ్లు పూర్తైనా ఇప్ప‌టికీ
ఈ సినిమాలోని ఎస్జే సూర్య (S. J. Suryah) చెప్పే వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్‌ డైలాగ్ చాలా ప్రాంతాల‌లో విరివిగా వినిపిస్తూ ఉంటుందంటే ఈ సినిమా జ‌నాల‌లోకి ఎంత‌లా వెళ్లిందో అర్థం చేసుకోవ‌చ్చు.

అయితే ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ తీయ‌డానికి మేక‌ర్స్ ఫ్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా కోసం హీరో శింబు, ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు మ‌రోసారి జ‌త క‌ట్ట‌బోతున్నారు.
ఈ సినిమాకు దసుమారు ద‌శాబ్దంకి పైగా హిట్ లేక కెరీర్ ఎండ్ కార్డ్‌ ప‌డుతున్న స‌మ‌యంలో హీరో శింబు(Simbu) కు ఈ చిత్రం ఓ అమృతంలా ఆదుకోవ‌డ‌మే కాక అప్ప‌టి వ‌ర‌కు శింబుకు ఉన్న స్టేట‌స్‌ను రెండింత‌లు రెట్టింపు చేసి అగ్ర స్థానంలో నిలిపింది.
దీంతో ఇప్పుడు ఈ సీక్వెల్‌పై అంచ‌నాలు క్ర‌మంగా ప్రారంభ‌మ‌య్యాయి.
అయితే.. ప్ర‌స్తుతం శింబు (Simbu), వెంక‌ట్ ప్ర‌భు ఇద్ద‌రు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న నేప‌థ్యంలో ఆ చిత్రాలు పూర్తి చేసిన అనంత‌రం తిరిగి ఈ సినిమాను ప‌ట్టాలెక్కించ‌నున్నారు.
తొలిభాగం నిర్మించిన నిర్మాత సురేష్ కామాక్షి (Suresh kamatchi)
ఈ సీక్వెల్‌ను సైతం నిర్మించనుండ‌గా మిగ‌తా న‌టీన‌టులు, టెక్నీషియ‌న్ల వివ‌రాలు త్వ‌ర‌లోనే వెళ్ల‌డించ‌నున్నారు.
ఇదిలాఉంటే ప్ర‌స్తుతం ఈ మానాడు (Maanaadu) మొద‌టి చిత్రం త‌మిళంతో పాటు తెలుగు ఇత‌ర భాష‌ల్లో సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version