పోర్జరీ సంతకాలతొ నా ఇల్లును జూనియర్ అసిస్టెంట్ కబ్జా….

పోర్జరీ సంతకాలతొ నా ఇల్లును జూనియర్ అసిస్టెంట్ కబ్జా.

రెవెన్యూ ఉద్యోగి పై చర్యలు తీసుకోవాలని భాదితుడు రాజగట్టు డిమాండ్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి కారల్ మర్క్స్ కాలనీ లో తనకు ఉన్న 350 గజాలు,అందులో ఉన్న పెంకుటిల్లును మొగుళ్లపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వీధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ వేమా లక్ష్మణ్ పోర్జరీ సంతకాలతో మున్సిపాలిటీలో నమోదు చేసుకున్నాడని మూగ.రాజాగట్టు అనే బాధితుడు విలేకరుల సమావేశంలో తెలిపాడు.ఈ విషయంగా జిల్లా కలెక్టర్,మున్సిపల్ కమిషనర్ కు ఆదరాలతో ఎన్నిసార్లు పిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.అంతేకాక ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ తమను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.అదే అదే విధంగా తాను 2000 సంవత్సరంలో భూపాలపల్లికి చెందిన వెలిశెట్టి రాజయ్య తనకు శేఖర్ వద్ద నుండి అట్టి ఇల్లును భూమిని కొని ఇచ్చాడని పేర్కొన్నారు.ఆ క్రమంలో స్టాంపు కాగితంతో పాటు వెలిశెట్టి రాజయ్య,ముద్ధసాని రాజయ్య,చిలకని నరసింగములు సాక్షులుగా ఉన్నారు.2000- 2004 వరకు ఆ ఇంటిలో నివాసం ఉండి తన పేరు మీద గ్రామపంచాయతీ నెంబర్,నల్లాను తీసుకున్నట్లు పేర్కొన్నారు.అనంతరం తనకు బంధువుగా ఉన్న లక్ష్మణ్ వద్ద కొంత అప్పుగా తీసుకున్నానని,ఆ తర్వాత వడ్డీతో సహా చెల్లించడం జరిగిందాన్నారు.ఆదేవిధంగా 2004 నుండి తాను ఆర్టీసీ లో ఉద్యోగ రీత్యా మంధని లో సిగేసుకుంటున్నాను.ఆలాగే సదరు ఉద్యోగి భూపాలపల్లి ఆర్డీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నప్పుడు తన పలుకుబడితో మున్సిపల్ కార్యాలయంలో నా ఇల్లు ను విక్రయించినట్లు దొంగ కాగితాలు సృష్టించి మున్సిపల్ లో ఆన్లైన్లో ఇంటిని చేర్చుకున్నాడని వాపోయారు.ఈ విషయంగా పలుమార్లు లక్ష్మణ్ తో మాట్లాడితే నీకు ఇల్లు ఎక్కడిది అది నాదే అంటూ నా పైనే కేసులు పెట్టుదు భయాందోళనకు గురి చేశాడని అన్నారు.తప్పుడు పత్రాలతో నా ఇంటిని కబ్జా చేసిన రెవెన్యూ ఉద్యోగి లక్ష్మణ్ పై విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని,నాకు తగిన న్యాయం చేయాలని బాధితుడు రాజగట్టు డిమాండ్ చేశారు.తమ సంతకాలను ఫోర్జరీ చేశాడు.భూపాలపల్లి కారల్మార్క్స్ కాలనీలో రాజగట్టు కు చెందిన ఇల్లు విక్రయంలో ఉన్న తమ సంతకాలను రెవెన్యూ ఉద్యోగి వేమ లక్ష్మణ్ ఫోర్జరీ చేశారని సాక్షులు ముద్దసాని రాజయ్య వెలిశెట్టి రాజయ్య చిలుకాని నర్సింగంలు పేర్కొన్నారు.భూపాలపల్లి లో శేఖర్ అయ్యర్ నుండి 2000 సంవత్సరంలో రాజకట్టు అతనికి తాను ఇంటిని స్థలమును కొనుగోలు చేసి ఇవ్వడం జరిగిందని సాక్షులు వెలిశెట్టి.రాజయ్య పేర్కొన్నారు.2000 సంవత్సరం నుండి తన ఇంటిలో ఉంటూ గ్రామపంచాయతీ ఇంటి నెంబర్ తో పాటు నల్లని తీసుకున్నాడు.రెవెన్యూ శాఖలో పనిచేసే వేమా లక్ష్మణ్ కావాలని తమ సంతకాలను పూజలు చేసి విక్రయించినట్లు మున్సిపల్ కార్యాలయంలో అధికారుల అండదండలతో తన పేరుపైన ఇల్లు చేసుకోవడం అన్యాయమని అన్నారు. అక్రమంగా తాము లేకున్నా సాక్షులుగా తమ పేర్లను పూజలు చేసిన రెవెన్యూ ఉద్యోగిపై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని భూపాలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సాక్షులు తెలిపారు.ఈ విషయంలో ఎలాంటి తాత్సారం చేయకుండా వెంటనే బాధితుడి రాజగట్టుకు న్యాయం చేయాలని వారిని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version