శివాలయానికి ప్రహరీ ఎప్పుడో
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని శివాలయానికి (కైలాసగిరి మందిరం) ప్రహరీ లేకపోవ డంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆలయానికి దాదాపు 9 ఎకరాల భూమి ఉండగా.. కొంతవరకు మాత్రమే ఆలయ నిర్మాణం ఉంది. మిగతా ఆలయం చుట్టూ ఖాళీ ప్రదేశం ఉన్నప్పటికీ ఇంతవ రకూ ప్రహరీకి నోచుకోలేదు. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు ఇప్ప టికే ఆలయ స్థలాన్ని ఆక్రమించిన్నట్లు ఆరోపణలున్నాయి. అలాగే ప్రహరీ లేకపోవడంతో పందులు, పశువులు స్వేచ్చగా తిరుగుతున్నాయి. బయటి వ్యక్తులు సైతం వస్తుండడంతో సమస్యలు వస్తున్నాయి. విలు వైన ఈ ఆలయ ఖాళీ స్థలం అన్యాక్రాంతమవుతున్నా ఎవరూ పట్టించు కోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నిర్వాహకులు స్పందించి ఆలయం చుట్టూ ప్రహరీ నిర్మించాలని భక్తులు కోరుతున్నారు.
