బైక్ పై బీదర్ టు హైదరాబాద్…..

బైక్ పై బీదర్ టు హైదరాబాద్…..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి : ఎండు గంజాయిని అక్రమంగా తరలించి
సొమ్ము చేసుకుని వాటితో జల్సాలు చేసుకోవడం ఓ యివకుడు అదే వృత్తిగా చేసుకున్నాడు. శంషాబాద్ ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్ (30) తన బైక్ పై బీదర్ నుంచి అక్రమంగా ఎండు గంజాయిని తరలిస్తున్నాడు. సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి సమీపంలోని బ్రిడ్జి వద్ద ఎక్సైజ్ అధికారులు ముందస్తు సమాచారం మేరకు వాహనాల తనిఖీలు చేపట్టగా అక్రమంగా తరలిస్తున్న 1.114 కిలోల ఎండు గంజాయితో అజయ్ కుమార్ వారికి పట్టుబడ్డాడు. అతడు వద్ద నుంచి ఒక మొబైల్ ఫోను, బైకును స్వాధీనం చేసుకున్నారు. అయితే గతంలో కూడా ఇతడు పోలీసుల కళ్ళు కప్పి ఎండు గంజాయిని తరలిస్తున్నట్లు విచారణలో తేలిందని ఎక్సెజ్ అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో సీఐ శంకర్, ఎస్సై లు అనుదీప్, హన్మంతు, కానిస్టేబుల్స్ అరుణజ్యోతి, అంజిరెడ్డి, సాయి శివకాంత్, రాజేష్, శివకృష్ణలు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version