రజక్ పల్లి గ్రామసభలో అభివృద్ధి అంశాలు చర్చ

రజక్ పల్లిలో గ్రామసభ

నిజాంపేట: నేటి ధాత్రి

నిజాంపేట మండలం రజాక్ పల్లి గ్రామంలో శనివారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ వజ్జే కనకరాజు ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలపై గ్రామ సభలో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా భవనం ,సీసీ కెమెరాలు, పారిశుద్ధ పనులు గురించి మాట్లాడడం జరిగిందన్నారు. ప్రజల సహకారంతో గ్రామాన్ని మండలంలోనే మొదటి స్థానానికి తీసుకుపోదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి, నూతన పాలకవర్గం సభ్యులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version