ఝరాసంగం మండలం సంగెం (కె) గ్రామం లో ఇందిరమ్మ నూతన ఇల్లు ప్రారంభం :
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండలం సంగెం కె లో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి ముఖ్య అతిధులుగా మాజీ జెడ్పీ చైర్పర్సన్ మరియూ ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు హనుమంతరావు పాటిల్ హాజరయ్యారు ఆయన చేతులమీదుగా రిబ్బన్ కటింగ్ చేయించి నూతన గృహ ప్రవేశ కార్యక్రమము నిర్వహించారు…ఈ కార్యక్రమములో ఝరాసంగం మండలం ప్రజాప్రతినిధులు వివిధ గ్రామల సర్పంచ్ లు మరియు అధ్యక్షులు,మండల పెద్దలు,నాయకులు,వివిధ సంఘనాయకులు, అధికారులు,అనాధికారులు,బంధు మిత్రులు పాల్గోని ఇందిరమ్మ ఇల్లు పథకం కింద నూతన ఇల్లు నిర్మించుకున్న లబ్ధిధారులూ ఇంటి యాజమానులకు శుభకాంక్షలు తెలియజేసారు..
