ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్
భూపాలపల్లి నేటిధాత్రి
బుధవారం టేకుమట్ల మండలం ఎంపేడు గ్రామం నుండి జమ్మికుంట వరకు వయా వావిలాల మీదుగా నడిచే ఆర్టీసీ బస్సు సర్వీసును ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఘనంగా ప్రారంభించారు.
ఈ కొత్త బస్సు సర్వీస్ ప్రారంభంతో ఎంపేడు, వావిలాల పరిసర గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మరింత సులభతరం కానుంది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు సాధారణ ప్రజలకు జమ్మికుంటకు వెళ్లడం సౌకర్యవంతంగా మారనుంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో రవాణా సౌకర్యాల మెరుగుదల ముఖ్యమని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ రామకృష్ణ ఆర్టీసీ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
