ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్…

ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

బుధవారం టేకుమట్ల మండలం ఎంపేడు గ్రామం నుండి జమ్మికుంట వరకు వయా వావిలాల మీదుగా నడిచే ఆర్టీసీ బస్సు సర్వీసును ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఘనంగా ప్రారంభించారు.
ఈ కొత్త బస్సు సర్వీస్ ప్రారంభంతో ఎంపేడు, వావిలాల పరిసర గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మరింత సులభతరం కానుంది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు సాధారణ ప్రజలకు జమ్మికుంటకు వెళ్లడం సౌకర్యవంతంగా మారనుంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో రవాణా సౌకర్యాల మెరుగుదల ముఖ్యమని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ రామకృష్ణ ఆర్టీసీ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version