మల్లక్కపేటలో గ్రామ సభ రోడ్డు భద్రతపై అవగాహన…

మల్లక్కపేటలో గ్రామ సభ రోడ్డు భద్రతపై అవగాహన

పరకాల,నేటిధాత్రి

మండలంలోని మల్లక్కపేట గ్రామంలో సర్పంచ్ దొమ్మటి కవిత మధు ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు.ఈ సందర్బంగా గ్రామ అభివృద్ధి అంశాలతో పాటు,పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేకంగా చర్చించారు.అనంతరం నో హెల్మెట్ నో ఎంట్రీ నినాదంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.గ్రామంలోఉన్న ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,ఇతరులు హెల్మెట్ లేకుండా గ్రామంలోకి ప్రవేశాన్ని నిరోధించే దిశగా చర్యలు చేపట్టాలని అన్నారు.కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు రోడ్డు ప్రమాదాల ప్రధాన కారణాలు,వాటి నివారణ చర్యలపై గ్రామస్థులకు వివరించారు.అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్,ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.హెల్మెట్ వినియోగం ద్వారా ప్రాణ నష్టం తగ్గించవచ్చని సూచించారు.గ్రామస్థులు, ముఖ్యంగా యువత రోడ్డు భద్రత విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.గ్రామ స్థాయిలో తీసుకున్న ఈ నిర్ణయాలను కచ్చితంగా అమలు చేస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దొమ్మటి కవిత మధు,ఉపసర్పంచ్ పాలకుర్తి నాగశ్రీకాంత్,పంచాయతీ కార్యదర్శి సుమలత,కానిస్టేబుల్ రామకృష్ణ,వార్డు మెంబర్లు,గ్రామపంచాయతీ సిబ్బంది,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version