గుండాల విద్యుత్ శాఖ సబ్ ఇంజినీర్ నజీర్ కు ప్రశంషాపత్రం
గుండాల,నేటిధాత్రి:
గుండాల సెక్షన్ విద్యుత్ శాఖ సబ్ ఇంజినీర్ నజీర్ గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో గత 3 సంవత్సరాల నుండి ప్రజలందరి మరియు అధికారుల ఆదరాభిమానాలు పొందుతూ 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా వరంగల్ లో TGNPDCL సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి గా ప్రశంస పత్రం అందుకున్నారు. సిఎండి చేతుల మీదుగా ప్రశంస పత్రం తీసుకున్నందుకు గాను అధికారులు కొత్తగూడెం సూపరిండెంట్ ఇంజినీర్ మహేందర్ ,కొత్తగూడెం డివిషనల్ ఇంజినీర్ రంగస్వామి,ఎల్లందు ఏడిఈ రామారావు మరియు రెండు మండలాల విద్యుత్ వినియోగదారులు శుభాకాంక్షలు తెలియజేశారు.
