ప్రపోజ్ డే స్పెషల్.. ఈ గిఫ్ట్‌లతో మీ ప్రేమను వ్యక్తపరచండి..

ప్రపోజ్ డే స్పెషల్.. ఈ గిఫ్ట్‌లతో మీ ప్రేమను వ్యక్తపరచండి..

వాలెంటైన్స్ వీక్‌లో భాగంగా ఫిబ్రవరి 8న ప్రపోజ్ డే జరుపుకొంటారనే విషయం తెలిసిందే. ప్రేమను వ్యక్తపరచడానికి ఇది ప్రత్యేకమైన రోజట. ఒక గులాబీ పువ్వుతో పాటు కొన్ని గిఫ్ట్స్ ఇస్తే.. మీ ప్రపోజల్ మరింత స్పెషల్‌గా, జీవితాంతం గుర్తుండిపోయేలా మారుతుంది..

ఇంటర్నెట్ డెస్క్: వాలెంటైన్స్ వీక్‌లో రెండవ రోజు ఫిబ్రవరి 8న ప్రపోజ్ డే జరుపుకొంటారనే విషయం తెలిసిందే. ఈ రోజు ప్రేమను వ్యక్తపరచడానికి చాలా ప్రత్యేకమైనది. చాలా మంది గులాబీ పువ్వు ఇచ్చి తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. కానీ గులాబీతో పాటు ఓ మంచి బహుమతి ఇస్తే.. ఈ రోజు మరింత గుర్తుండిపోయేలా ఉంటుంది..
టెడ్డీ బేర్:

చాలా మంది అమ్మాయిలకు టెడ్డీ బేర్ అంటే ఇష్టం. వాటిని ఎప్పుడూ తమతోనే ఉంచుకుంటారు. కాబట్టి మీరు ఒక అందమైన టెడ్డీ బేర్‌ను బహుమతిగా ఇస్తే.. దాన్ని చూసినప్పుడల్లా ఆమె మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది.

ఫ్లవర్ బొకే:

మీరు ఫ్లవర్ బొకే ఇవ్వడం ద్వారా ప్రపోజ్ డేని మరింత స్పెషల్‌గా చేయొచ్చు. చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు బహుమతుల కంటే బొకేలను ఇష్టపడతారు. అందమైన పూల బొకే ప్రేమకు చిహ్నం. బొకేతో పాటు ఓ చిన్న గ్రీటింగ్ కార్డు ఇస్తే మరింత స్పెషల్‌గా ఉంటుంది.

కూకట్‌పల్లిలోని వైట్ వాటర్ కన్‌స్ట్రక్షన్‌పై కేసు నమోదు..

కూకట్‌పల్లిలోని వైట్ వాటర్ కన్‌స్ట్రక్షన్‌పై కేసు నమోదు..

 

హైదరాబాద్ కూకట్‌పల్లిలోని వైట్ వాటర్ కన్‌స్ట్రక్షన్‌పై కేసు నమోదు అయింది. ప్లాట్స్ కట్టిస్తామని చెప్పి మోసం చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 500 మంది నుంచి రూ.270 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది..

హైదరాబాద్: కూకట్‌పల్లిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న వైట్ వాటర్ కన్‌స్ట్రక్షన్ సంస్థపై కేసు నమోదు అయింది. ప్లాట్లు కట్టిస్తామని నమ్మబలికి వందలాది మందిని మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదుల ప్రకారం.. సుమారు 500 మంది నుంచి దాదాపు రూ.270 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. పదేళ్లుగా వివిధ ప్రాజెక్టుల పేరుతో డబ్బులు తీసుకుంటూ వచ్చినప్పటికీ, హామీల మేరకు ప్లాట్లు ఇవ్వలేదని బాధితులు చెబుతున్నారు.
ఈ వ్యవహారంపై సంస్థ యజమాని అజయ్‌తో పాటు మరికొంతమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే వైట్ వాటర్ కన్‌స్ట్రక్షన్‌పై సైబరాబాద్ EOWలో సుమారు వంద మంది ఫిర్యాదు చేసినట్టు సమాచారం. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వసూలు చేసిన నిధుల వినియోగం, ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితి వంటి అంశాలపై అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version