గుడుంబా స్థావరం పై రైడ్ చేసిన పోత్కపల్లి పోలీసులు..
గుడుంబా తయారు చేసిన అమ్మిన కఠిన చర్యలు…పోత్కాపల్లి ఎస్సై దీకొండ రమేష్
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండల లోని కొలనూరు గ్రామం లో పోత్కపల్లి ఎస్సై దీీకొండ రమేష్ సిబ్బందితో కలిసి గుడుంబా స్థావరంపై రైడ్ చేసి 500 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం మరియు 5 లీటర్ల గుడుంబా ను పట్టుకొని దానిని తయారుచేసిన బోదాసు పద్మ భర్త పేరు సదయ్య వయసు 40 సంవత్సరాలు కులం వడ్డెర కొలనూరు గ్రామం అనే ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పొత్కపల్లి ఎస్ఐ దీకొండ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై దీకొండ రమేష్ మాట్లాడుతూ గ్రామాలలో పేకాట, కోడి పందాలు ఆన్లైన్ బెట్టింగులు, క్రికెట్ బెట్టింగ్,బహిరంగ ప్రదేశంలో జూదం,మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే లేదా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే పోత్కపల్లి ఎస్ఐ సెల్ నెంబర్ 8712656514, కు సమాచారం అందించాలని సూచించారు.చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన ఎంతటి వారినైనా చట్టప్రకారం శిక్షించడం జరుగుతుందని ఎస్ఐ హెచ్చరించినారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఇట్టి రైడ్ లో పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ తో పాటు, హెడ్ కానిస్టేబుల్ కిషన్, కానిస్టేబుల్స్ రాజేందర్ రాములు పాల్గొన్నారు.