వేసవి సెలవుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి..

వేసవి సెలవుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి*

గీసుగొండ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సీఐ విశ్వేశ్వర్ కీలక సూచనలు

గీసుగొండ,నేటిధాత్రి:

 

 

 

తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం నుండి వేసవి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో గీసుగొండ ప్రాంత ప్రజలకు పోలీసులు పలు ముఖ్య సూచనలు జారీ చేశారు. పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సీఐ విశ్వేశ్వర్ కీలక సూచనలు చేశారు.విద్యాశాఖ ఆదేశాల మేరకు సెలవుల సమయంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం పూర్తిగా నిషేధమని, ఈ నిబంధనలు ఉల్లంఘించే పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నందున మధ్యాహ్న సమయంలో పిల్లలను బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే బావులు, చెరువులు, కాలువలు వంటి ప్రమాదకర ప్రాంతాలకు ఈత కోసం వెళ్లకుండా పిల్లలను కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని పేర్కొన్నారు.అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు కాల్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని తెలిపారు.ప్రజలందరూ పై సూచనలు పాటించి పిల్లల భద్రతకు సహకరించాలని గీసుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. విశ్వేశ్వర్ విజ్ఞప్తి చేశారు.

రోడ్లపై మొక్కజొన్న,ధాన్యాలు ఆరబెట్టరాదు…

రోడ్లపై మొక్కజొన్న,ధాన్యాలు ఆరబెట్టరాదు

గుండాల సిఐ లోడిగ రవీందర్

గుండాల,నేటిదాత్రి:

 

గుండాల మండలంలో ప్రధాన రోడ్లపై మొక్కజొన్న సహా ఇతర ధాన్యాలను ఆరబెట్టడం వల్ల వాహనాలు స్కిడ్ అవుతున్న ఘటనలు చాల ఉన్నాయని రహదారులు జారుడు స్వభావం పొందడంతో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఇటీవలి రోజులలో ఉదయం సమయంలో మంచు పెరగడం వల్ల రోడ్డు స్పష్టత తగ్గి, వాహనదారులకు ముందున్న రహదారి కనిపించక ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి అని గుండాల సీఐ రవీందర్ అన్నారు.
ప్రధాన రహదారుల్లో మొక్క జొన్నలు, ధాన్యలు అరపోసే రైతులకు,ప్రజలకు వాహనదారులకు తగు సూచనలు పాటించాలని తెలిపారు.
రహదారులపై మొక్కజొన్న, ధాన్యాలు, పంట అవశేషాలను ఆరబెట్టరాదు.
ఇది చట్టపరంగా కూడా నేరం, రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతుంది.
మీ భూములలో, పొలాల్లో లేదా ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో మాత్రమే పంటలను ఆరబెట్టాలి.
రోడ్డుపై ధాన్యం కొరకు కర్రలు, రాళ్లు అడ్డు పెట్టడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, అలా చేయరాదు.
మంచు ఎక్కువగా ఉన్నప్పుడు వాహన వేగాన్ని తప్పనిసరిగా తగ్గించాలి.
హెడ్‌లైట్లు లో బీమ్ లో ఉంచి, ఇండికేటర్లు ఆన్ చేయాలి.
ముందు వెళ్తున్న వాహనానికి సరైన దూరం పాటించాలి.
రోడ్డు మధ్యలో తడి,ధాన్యం పంట అవశేషాలు కనిపిస్తే వెంటనే వేగం తగ్గించాలి.
అత్యవసరమైతే మాత్రమే ఉదయం ప్రయాణించాలి.
పోలీస్ శాఖ తరఫున
ప్రజల భద్రత కోసం అందరూ ఈ సూచనలు ఖచ్చితంగా పాటించాల్సిందిగా కోరారు.
ప్రతి ప్రాణం విలువైనది. రోడ్డు నియమాలు పాటించి బాధ్యతగా నడపండి, ప్రమాదాలు నివారించండి అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version