ఆర్టిజన్ అన్ మ్యాన్ కార్మికులను కన్వర్షన్ చేయాలి
ధర్మ సమాజ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీందర్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆర్టిజన్ కార్మికులు చేస్తున్న సమ్మెకు ధర్మసమాజ్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ జిల్లా కమిటీ పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా వారు కొత్తూరు రవీందర్ మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన ఆర్థిక భారం లేని డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి బిఆర్ఎస్ ప్రభుత్వం కరెంటు ఉద్యోగులను మోసం చేసి ఆర్టిజన్ కార్మికులుగా మార్చింది కరెంటు ఉద్యోగుల సమస్య తెలంగాణ ప్రజల సమస్యగా మారే ప్రమాదం ఉంది దానివల్ల రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతదని సందర్భంగా డిమాండ్ చేస్తున్నా వారి డిమాండ్లను నెరవేర్చకపోతే ధర్మసమాజ్ పార్టీగా వారితో ఏ పోరాటకైనా సిద్ధపడతామని వారికి పూర్తి సంఘీభావాన్ని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వంగపండ్ల రాజయ్య యాదవ్ కొయ్యడ రమేష్ రేణిగుంట్ల మహేష్ మహేందర్ శీలపాక హరీష్ పాల్గొన్నారు
