సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి

సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి..

మందమర్రి నేటి ధాత్రి:

 

సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కళాశాల,సిసిసి-నన్పూర్లో మొదటి సంవత్సరం లో ప్రవేశాల కోసం విద్యార్థులు ధరఖాస్తు చేసుకోవాలని మందమరి ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు కొత్తగూడెం ఎడ్యుకేషనల్ సొసైటి నుండి నోటిఫికేషన్ విడుద లైనట్లు తెలిపారు.
కళాశాలలో మొదటి సంవత్సరం సివిల్ కోర్సులో 60.ఎలక్ట్రిక ల్-ఎలక్ట్రానిక్స్-60, మెకానికల్-60, మైనింగ్-60..మొత్తం 300సీట్లు ఉన్నాయన్నారు. వీటిలో 150 సీట్లను సింగరేణి ఉద్యోగులు, మాజీ ఉద్యోగల పిల్లలకు,150 సీట్లు ఇతరు లకు కేటాయించడం జరుగుతుందన్నారు.
సింగరేణి ఉద్యో గులు, మాజీ ఉద్యోగుల పిల్లలు జులై 3వ తేదీ లోపు సింగరేణి పాలిసెట్ వెబ్సైట్ ద్వారా(https://scp.scpolytechnic.com/online_admission), ఇతరులు తెలంగాణ పాలిసెట్ వెబ్సైట్ (https://tgpolycet.nic.in) ద్వారా..ఈ నెల 24 నుంచి 28 వ తేదీలోపు ఆన్లైన్ ధరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాలకు..సెల్ 9010222161, 8790112515 సంప్రదించండి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version