ఎన్నికలు పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలి : కమిషనర్ చంద్రశేఖర్
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :
మునిసిపల్ ఎన్నికలు పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలని అలియాబాద్ మునిసిపల్ కమిషనర్ చంద్రశేఖర్ అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శుక్రవారం పి ఓ, ఏ పి ఓ లకు మజీద్ పూర్ శ్రీ చైతన్య పాఠశాలలో మున్సిపల్ కమిషనర్, ట్రైనర్స్ ఆధ్వర్యం లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఎన్నికల విధులకు హాజరయ్యే పి ఓ, ఏ పి ఓ ఎన్నికల విధులపై శఅవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఓ, ఏ ఆర్ ఓ లు, ఎన్నికల సిబ్బంది, ట్రైనర్స్ పాల్గొన్నారు.
