ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు విచారణ చేపట్టిన డిఎస్పి
మొగుళ్లపల్లి నేటి ధాత్రి
మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు కాగా భూపాలపల్లి డి.ఎస్.పి సంపత్ రావు బుధవారం విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించి. మొగుళ్లపల్లి మండలంలోని కొరికిషాల గ్రామానికి చెందిన మాల కులానికి చెందిన ఈత ఓదమ్మ,వృత్తి కూలి, . 2.మార్చి .2026 న మా గ్రామంలో ఉపాధి హామీ కరువు పని నిమిత్తం పోయి పని చేస్తూ ఉండగా అక్కడ నాతోపాటుగా కరువు పనికి వచ్చిన ఆరె కులానికి చెందిన లింగంపల్లి సునీత, మాల కులం పేరుతో బూతులు తిడుతూ నన్ను అకారణంగా బూతులు తిట్టగా , నేను ఆమె జోలికి పోకుండా ఊరుకున్నాను. తేదీ 3 మార్చి 2026 రోజున ఉదయం 7 గంటల 30 నిమిషాల సమయాన నీను మా గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో విషయాన్ని తెలుపుతుండగా సదరు సునీత ఆమె భర్త లింగంపల్లి రాయమల్లు ఆగయ్య దంపతులు ఇద్దరు కలిసి పచ్చి బూతులతో పలుసార్లు కులం పేరుతో దూషిస్తూ సునీత, రాయమల్లు వారు కాళ్లకు వేసుకునే చెప్పులతో నన్ను కొట్టి కొట్టి, కిందపడేసి చేతులతో కొట్టి, కాళ్లతో తన్నినారని కులం పేరుతో దూషిస్తూ కొట్టిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకొని నాకు తగిన న్యాయం చేయగలరని దరఖాస్తు రాగా మొగుళ్ళపల్లి ఎస్సై బి అశోక్ కేసు నమోదు చేయగా భూపాలపల్లి డి.ఎస్.పి సంపత్ రావు బుధవారం కొరికిశాల గ్రామంలో విచారణ చేపట్టారు.
